మహేష్ కోసం ధోనీ భామ వచ్చేసింది

Update: 2017-06-27 13:20 GMT
ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ కైరా అద్వానీ. అంతకు ముందు కూడా సినిమాలు చేసినా.. ధోనీ తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడీ భామ టాలీవుడ్ మూవీలో నటించేయబోతోంది.

అది కూడా తొలి ఛాన్స్ లోనే మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ తో నటించే అవకాశం రావడం విశేషం. మురుగదాస్ తో స్పైడర్ మూవీ చేస్తున్న మహేష్ బాబు.. ఇప్పటికే తన తర్వాతి సినిమా కూడా మొదలుపెట్టేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే టైటిల్ మూవీ చేయనుండగా.. ఈ సినిమాలో కైరా అద్వానీకి అవకాశం లభించింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైపోగా.. ఇప్పుడు కైరా అద్వానీ కూడా స్పాట్ కు వచ్చేసింది.

హలో హైద్రాబాద్ అంటూ మహేష్ మూవీ షూటింగ్ కోసమే హైదరాబాదులో అడుగుపెట్టినట్లు కియారా కన్ఫామ్ చేసింది. శ్రీమంతుడు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కావడంతో.. భరత్ అనే నేను చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 2018 సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేస్తూ.. ఈ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేయడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News