మహేష్ హీరోయిన్ కు లక్కీ చాన్స్

Update: 2018-07-18 04:57 GMT
కైరా అద్వానీ దశ తిరిగిపోయింది. ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోని జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ చిత్రంలో నటించిన కైరాకి ఆ చిత్రంతో మంచి పేరొచ్చింది. అందులో చూసిన తర్వాతే దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు పక్కన అవకాశం ఇచ్చారు. భరత్ అనే నేను రిలీజ్ కావడం.. అందులో కైరా అద్భుతంగా నటించడం చూశాక.. నిర్మాత డీవీవీ దానయ్య తను తాజాగా రాంచరణ్ తో తీస్తున్న చిత్రంలోనూ అవకాశం ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ లో ఉంది.

కైరాలో గ్లామర్ పాత్రలతో పాటు సెక్సీ రోమాంటిక్ పాత్రలను కూడా అవలీలగా పోషిస్తుంది. హిందీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ లో ఓ సెక్స్ సన్నివేశంలో ఆమె నటించిన తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇలా అన్ని పాత్రలు చేయగలనని నిరూపించిన కైరాకు తాగా మరో బయోపిక్ లో అవకాశం లభించింది.

పరమ వీర చక్ర అవార్డు గెలుచుకున్న అమర జవాన్ విక్రమ్ బాత్రా జీవిత కథతో రూపొందించే చిత్రంలో హీరోయిన్ గా ఆమె ఎంపికైంది. సిద్ధార్త్ మల్హోత్రా హీరోగా నటించే ఈ చిత్రానికి కరణ్ జోహర్ నిర్మాత. ఇలా తెలుగులోనే కాదు.. హిందీలోనూ అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం కైరా రెండు చేతుల సంపాదిస్తోంది.

ఇక తాజాగా కైరా... నిర్మాత డీవీవీ దానయ్యపై వస్తున్న విమర్శలకు స్పందించింది. భరత్ అనే నేను సినిమాకు కైరాకు పారితోషకం ఎగ్గొట్టాడని వస్తున్న వార్తలు వట్టి రూమర్లేనని స్పష్టం చేసింది. నిర్మాత దానయ్యతో తాను వరుసగా రెండో చిత్రం చేస్తున్నానని.. ఎగవేస్తే ఎలా చేస్తానంటూ వివరణ ఇచ్చింది.
Tags:    

Similar News