నటి శ్రీరెడ్డిపై కరాటే కళ్యాణి ఫిర్యాదు - కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2020-02-18 15:24 GMT
నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా వివాదానికి మారుపేరుగా మారారు. ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, ఇతరులపై చేస్తున్న విమర్శలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా, ఆమెపై మరో నటి కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కరాటే కళ్యాణి  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు - శ్రీరెడ్డిపై 67 ఐటీ యాక్ట్‌ తో పాటు 506 అండ్ 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియా లైవ్‌ లో భాగంగా తనపై అసభ్యకర పదజాలం ఉపయోగించినట్లు కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ చేసినా లేదా మద్దతు పలికినా చట్టరీత్యా నేరమని - అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. కరాటే కళ్యాణి ఫిర్యాదుపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తుల ప్రతిష్టను కించపరిచేలా కామెంట్స్ చేయడం నేరమన్నారు.

కాగా, తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో కరాటే కళ్యాణీపై శ్రీరెడ్డి ఫిర్యాదు చేశారు. తనను బెదిరించారని, చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరెడ్డి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పలువురిని టార్గెట్ చేస్తున్నారు. ప్రముఖులపై సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆమె మీడియాలో నానేందుకు ఇలా చేస్తున్నారని కొందరు అంటే, వాస్తవాలు చెబుతోందని చెప్పేవారు కూడా లేకపోలేదు.
Tags:    

Similar News