200 కోట్ల క్లబ్ ద‌ర్శ‌కుడిపైనే ఆరోప‌ణ‌లు

Update: 2019-04-25 05:01 GMT
కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ పై ఓ జూనియ‌ర్ ఆర్టిస్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే ఇది వేధింపుల వ్య‌వ‌హార‌మా? అంటే అదేమీ కాదు.. త‌న‌ని అవ‌మానించేలా ద‌ర్శ‌కుడు అట్లీ తిట్టాడ‌ని స‌ద‌రు జూ.ఆర్టిస్టు ఫిర్యాదు చేయ‌డంతో ప్ర‌స్తుతం పోలీస్ విచార‌ణ సాగుతోంది. వివ‌రాల్లోకి వెళితే..

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క్రీడానేప‌థ్యం ఉన్న‌ ఈ చిత్రంలో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చెన్న‌య్ ప‌రిస‌రాల్లో మూవీని చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఆన్ లొకేష‌న్ జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌పై జూనియ‌ర్ ఆర్టిస్టు కృష్ణ దేవి ద‌ర్శ‌కుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసుల్ని ఆశ్ర‌యించారు. లొకేష‌న్ లో స‌రిగా తిండి .. టాయ్ లెట్లు వంటి క‌నీస సౌక‌ర్యాలు లేవ‌ని కృష్ణ‌దేవి ద‌ర్శ‌కుడికి ఆరోపించార‌ట‌. అయితే అందుకు అట్లీ సీరియ‌స్ అయ్యి త‌న‌ని తిట్టేశారు. ఏప్రిల్ 13న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అప్ప‌ట్లో ఫిర్యాదు చేయాల‌ని భావించినా  ఎన్నిక‌ల విధుల్లో పోలీసులు బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం న‌స‌ర‌త్ పేట్ పోలీస్ స్టేష‌న్ లో స‌ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టు ఫిర్యాదును పోలీసులు స్వీక‌రించారు. త‌న‌ని అవ‌మానిస్తూ తిట్టినందుకు అట్లీపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా స‌ద‌రు న‌టీమ‌ణి ఫిర్యాదు చేశార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై అట్లీ స్పందించలేదు.

శంక‌ర్ .. ఏ.ఆర్.మురుగ‌దాస్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌ని చేసిన అట్లీ ప్ర‌స్తుతం కోలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్. విజ‌య్ హీరోగా తేరి.. మెర్స‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ని  తెర‌కెక్కించాడు. మెర్స‌ల్ ఏకంగా 200 కోట్లు వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగానే అట్లీ హ్యాట్రిక్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌డిపై ఈ ఫిర్యాదు చేయ‌డంపై ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ సాగుతోంది.
    

Tags:    

Similar News