జాన్వీ కోసం ఎగబడ్డారుగా..

Update: 2018-05-26 12:03 GMT
బాలీవుడ్ లో మరికొన్ని రోజుల్లో ధఢఖ్ హవా కొనసాగేలా ఉంది.  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం కావడంతో ఓ వర్గం వారిలో ఆమె ఎలా నటిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరికొన్ని రోజుల్లో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. అయితే శ్రీదేవి కూతురు అని ఒక పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది గాని జనాలు ఆదరిస్తారా లేదా అనేది ఆమె బయటకు వచ్చే వరకు తెలియదు.

కానీ రీసెంట్ గా కొంత మంది జాన్వీ కోసం ఎగబడిన విధానం చూస్తుంటే అమ్మడు క్రేజ్ తొందరగానే అందుకునేలా ఉందని టాక్ వస్తోంది. రీసెంట్ గా జిమ్ నుంచి బయటకు వస్తున్న జాన్విని చూసి కొంత మంది ఆమెని కలుసుకోవడానికి ఎగబడ్డారు. అందులో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారు. పెద్దవాళ్లకు కలుసుకోవడానికి అవకాశం దొరకలేదు. జాన్విని ఎక్కువగా పిల్లలే కవర్ చేశారు. ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నించగా పరిస్థితి కొంచెం అదుపు తప్పినట్లు అనిపించింది.

అయినా కూడా జాన్వీ ఏ మాత్రం తొందరపడకుండా నవ్వుతూనే వారికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇక చివరికి తన బాడీ గార్డ్ సహాయంతో జాన్వీ కారు ఎక్కి టాటా చెబుతూ వెళ్లిపోయింది. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దఢఖ్ సినిమాను నిర్మాత కరణ్ జోహార్ జూన్ 15న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  ఇషాన్ ఖతార్ హీరోగా నటించాడు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News