రైల్వే స్టేషన్ లో జబర్దస్త్ టీమ్ హాల్ చల్

Update: 2018-04-25 12:36 GMT
జబర్దస్త్ షోతో పాపులర్ అయిన శేషు మరియు అతని టీమ్ విశాఖ రైల్వేస్టేషన్ లో ఎవరు ఊహించని విధంగా కనిపించారు. టీసి తో గోడవపడుతూ కనిపించడం అక్కడి ప్రయాణికులను షాక్ కి గురి చేసింది. అంతే కాకుండా వారు వాగ్వివాదానికి దిగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనరల్ టికెట్స్ తీసుకొని థర్డ్ ఏసీల్లో ప్రయాణం చేసినందువల్ల ఇరువురికి వివాదాలు మొదలైనట్లు సమాచారం.

రైల్వే అధికారులు తోటి ప్రయాణికులు తెలిపిన కథనం ప్రకారం.. హౌరా హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో విజయనగరం నుంచి విశాఖ వరకు జబర్దస్త్ టీమ్ తో పాపులర్ అయిన శేషు అతని సన్నిహితులు ప్రయాణించారు. అయితే జనరల్ లో టికెట్స్ బుక్ చేసుకున్న ఏడుగురు ఏసీ ల్లో ఎక్కారు. టీసి వారిని విచారించగా తాము సెలబ్రెటీలమంటూ వాగ్వివాదానికి దిగారని తోటి ప్రయనికుల్లో ఒకరు తెలిపారు. అంతే కాకుండా టీసి పై చేయి చెసుకున్నట్లు కూడా మరికొంత మంది చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అయితే ఏసీలో ప్రయాణం చేసినందుకు శేషు మరియు అతని సన్నిహితులు జరిమానా కట్టినట్లు చెప్పారు. అదే విధంగా టీసి వారిని అవమానకరంగా దుర్భాశలాడినట్లు జబర్దస్త్ టీమ్ చెబుతోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News