సుప్రీం హీరో స్పీడ్ చూపిస్తున్నాడు

Update: 2016-04-30 10:55 GMT
సాయి ధరం తేజ్ వచ్చే వారంలో సుప్రీం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సరైనోడు సూపర్ హిట్ తో ఉత్సాహం మీద ఉన్న మెగాభిమానులను.. మరింతగా అలరించేదుకు వస్తున్నాడు తేజు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొత్తం హీరోల్లో.. సాయిధరం స్పీడ్ ఎవరూ చూపించలేకపోతున్నారన్న మాట ఒప్పుకోవాల్సిందే.

ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న సుప్రీం, ఆ తర్వాత రెండు నెలల్లో విడుదలకు సిద్ధమయ్యే తిక్క.. ఇవి కాక ఇప్పుడు మరో మూవీని స్టార్ట్ చేసేశాడు సాయి ధరం తేజ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేజు హీరోగా ఓ ప్రాజెక్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే. ఇప్పుడీ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. నిర్మాతలు టాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిల ఆఫీస్ లో ఈ వేడుకను నిర్వహించారు.

తేజు సరసన ఈ చిత్రంలో కుర్ర బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News