బేగమ్ జాన్ తో మళ్లీ వస్తానంటోంది

Update: 2017-03-25 07:06 GMT
హీరోయిన్ ఆశా షైనీ ని టాలీవుడ్ జనాలు లక్స్ పాపగానే ఎక్కువ గుర్తు పెట్టుకున్నారు. ప్రేమ కోసం చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన ఈమె కెరీర్ లో బ్లాక్ బస్టర్లు బాగానే ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఆ తర్వాత తన అసలు పేరు ఫ్లోరా షైనీ కి షిఫ్ట్ అయిపోయి.. బాలీవుడ్ లో నటించేస్తోంది.

త్వరలో విడుదల కానున్న బేగమ్ జాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది ఆశా షైనీ. విద్యా బాలన్ లీడ్ రోల్ చేయగా.. గుజరాత్ కు చెందిన మైనా అనే ఓ ట్రైబల్ పాత్రలో ఫ్లోరా షైనీ కనిపించనుంది. ఈ మూవీని చూసిన తర్వాత తనకు మళ్లీ టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది ఫ్లోరా. "టాలీవుడ్ జనాలకు పంక్చువాలిటీ ఎక్కువ. అందుకే తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ జనాలు నన్ను మర్చిపోయారు. నేను తెలుగు ఫ్లుయెంట్ గా మాట్లాడగలను. బేగమ్ జాన్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నా" అంటోంది భామ.

బేగమ్ జాన్ లో ఫ్లోరా షైనీ  ఓ బ్రోతల్ గా నటించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేశ్యలతో.. విద్యాబాలన్ వేశ్యా గృహం నిర్వహిస్తే.. అక్కడుండేవారిలో ఒక బ్రోతల్ గా ఫ్లోరా నటించింది. ఈ సినిమాకి ముందే తాను బ్రోతల్ చుట్టూ కథ తిరిగే ఓ సినిమాలో నటించడంతో.. ఈ పాత్రను మరింతగా రక్తి కట్టించానని చెప్పింది ఫ్లోరా షైనీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News