ఫుట్ పెయింటింగ్ పీక్స్ లో క‌నెక్ట‌య్యింద‌మ్మా

Update: 2020-11-04 11:10 GMT
పోస్ట్ లాక్ డౌన్ సెల‌బ్రేష‌న్ కోసం మాల్దీవులకు ప‌య‌న‌మైన‌ బాలీవుడ్ ప్రముఖుల జాబితా తెలిసిందే. తాప్సీ పన్నూ- వరుణ్ ధావన్- నేహా ధూపియా.. అలాగే ఎల్లీ అవ్రామ్ ఐల్యాండ్ లో అడుగుపెట్టారు.  తన స్నేహితురాలు డీన్ పాండేతో కలిసి ఎల్లీ అవ్రామ్ తన ట్రిప్ నుండి తన ఫాలోవ‌ర్స్ అంతా అసూయపడేలా అదిరిపోయే ఫోటోల‌ని పంచుకుంటున్నారు.

ఇంత‌కుముందు బికినీ ధ‌రించి తాటి చెట్టు దగ్గర ఫోటోషూట్లో పాల్గొన్న ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేశాయి. పసుపు నీలం రంగుల కలయిక తో బికినీ ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంది.  

ఎల్లీ రెండు రోజుల క్రితం మాల్దీవుల్లో తన మొదటి ఇన్ స్టాగ్రామ్ రీల్ ను కూడా ప్రారంభించింది.  “మరో కల నిజమైంది. మాల్దీవులలో నా మొదటి అనుభవాన్ని చాలా చిరస్మరణీయంగా చేసినందుకు andkandima_maldives ధన్యవాదాలు. నా తదుపరి సందర్శన కోసం నేను ఇప్పటికే వేచి ఉండలేను !!!. ఇది నా మొదటి ఇన్ స్టాగ్రామ్ రీల్, ”అని ఆమె పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చింది.

ఇదేకాదు ఎల్లీ షేర్ చేసిన ఫోటోల్లో ఈ అమ్మ‌డు బీచ్ రిసార్ట్ లో పెయింటింగ్ చేస్తూ చిద్విలాసంగా క‌నిపించిన ఫోటో ఇంటర్నెట్ ని ఓ రేంజులోనే షేక్ చేస్తోంది. ఆద‌మ‌రిచి ఈ అమ్మ‌డు ఏకంగా ఆ కాలిని డ్రాయింగ్ స్టాండ్ పైకి అలా ఎత్తేసిందా? అన్న సందేహం క‌ల‌గ‌వ‌చ‌చు. కానీ త‌న కాలిని ఎత్తింది అంటే..దానికి కార‌ణం‌ ఫుట్ పెయింటింగ్ ఆర్ట్ లో త‌న స‌త్తా ఎంతో చూపించాల‌న్న ఉద్ధేశ‌మేన‌ట‌. ఇక సౌత్ లో ఎల్లీ అవ్ రామ్ న‌టించిన పారిస్ పారిస్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ క్వీన్ కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News