బాషా డైరెక్టర్ ఇలా అయిపోయాడా?

Update: 2017-01-19 04:37 GMT
దర్శకుడు సురేష్ కృష్ణ.. కోలీవుడ్ టాలీవుడ్ లలో దర్శక దిగ్గజంగా చెప్పుకునే వ్యక్తి. రజినీకాంత్ బాషా లాంటి మూవీ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్ ఈయన. మెగాస్టార్ చిరంజీవితో మాస్టర్.. డాడీ వంటి సినిమాలు తీశాడు. వెంకటేష్.. నాగార్జునల.. కమల్ హాసన్ వంటి పెద్ద స్టార్లతో కూడా సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. కొన్నేళ్లుగా బాగా వెనకబడిపోయాడు. తెలుగులో చివరిగా దాసరితో మేస్త్రి అనే మూవీని 2008లో తీశాడంతే.

ఇప్పుడీ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బుల్లితెరపైకి రాబోతోన్నాడు. అది కూడా తెలుగు టీవీ సిరీస్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. 2012లో కన్నడలో కటారి వీర సూరసుందరాంగి చిత్రం తీసిన తర్వాత.. ఇన్నేళ్లూ గ్యాప్ తీసుకున్న ఈయన.. ఇప్పుడు మరోసారి బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకోనున్నాడు. 'గణపతి కాంప్లెక్స్' అనే టైటిల్ పై ఈ టీవీ సిరీస్ రూపొందింది.

గణపతి కాంప్లెక్స్ కు సురేష్ కృష్ణ నిర్మాణం వహించగా.. దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మరికొన్ని విభాగాలను కూడా హ్యాండిల్ చేశారు. ఇవాల్టి నుంచే ఈ టీవీ సిరీస్ ప్రసారం కానుండగా.. అంత పెద్ద దర్శకుడు బుల్లితెరతో సరిపెట్టుకోవడాన్ని ఆయన అభిమానులను హర్ట్ చేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News