ప్రముఖ టీవీ యాంకర్ కు కరోనా పాజిటివ్

Update: 2020-04-01 04:45 GMT
కరోనా మహమ్మారి ధాటికి అందరికీ వైరస్ సోకుతోంది.  అందరిపై పంజా విసురుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలమందికి పైగా కరోనా సోకింది.  దేశ ప్రధానులు,  ప్రముఖులు, వీఐపీలను కూడా పట్టి పీడిస్తోంది.

తాజాగా ప్రముఖ టీవీ చానెల్ యాంకర్ కు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. డ్రగన్ కంట్ర చైనాలో పుట్టిన ఈ వైరస్ 200 దేశాలకు చేరువ అవుతోంది. అమెరికా వణికిపోతోంది. వైరస్ విలయతాండవం చేస్తోంది.

ప్రపంచ ప్రసిద్ధ చానెల్ సీఎన్ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్ క్రిస్ క్యూమోకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని మార్చి 31 ఆయనే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించారు.

మంగళవారం 9pm ప్రోగ్రామ్ లో క్రిస్ క్యూమో పాల్గొనాల్సి ఉండగా..  ఇంతలో ఈ విషయం బయటపడినట్లు  వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనా రోగులతో కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడడం చర్చనీయాంశంగా మారింది. కాగా న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఇతడు సోదరుడు కావడం గమనార్హం.
Tags:    

Similar News