చిరంజీవి Vs బాలయ్య వన్స్ మోర్?

Update: 2020-06-02 09:50 GMT
బాక్సాఫీసు పోటీలు ఎప్పుడూ ప్రేక్షకులకు అసక్తికరంగా ఉంటాయి.  ఒక్కోసారి పోటీ శృతిమించుతుంది కానీ ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజైతే అందరి దృష్టి ఆ సినిమాలపైనే ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సారి బాలయ్య సినిమాను చిరంజీవి 'ఆచార్య' కు పోటీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమచారం.

ప్రస్తుతం బాలయ్య తన కొత్త సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. బోయపాటి - బాలయ్య హ్యాట్రిక్ పై కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు.  వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయంపై స్పష్టత లేదు కానీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయని అంటున్నారు.

చిరంజీవి తో బాలయ్య బాక్స్ ఆఫీస్ పోటీ జరిగి చాలా కాలం అయింది.  అయితే ఈమధ్య వారిద్దరి మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు.  మరి ఈసారి జరగబోయే బాక్స్ ఆఫీస్ పోటీలో బాలయ్య విన్ అవుతాడేమో చూడాలి.  ఈ పోటీలో మరో ప్రత్యేకత కూడా ఉండబోతోంది. అది బోయపాటి Vs కొరటాల.  త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో స్పష్టత రానుందట.
Tags:    

Similar News