ధోనీతో బ్రేక‌ప్.. రాయ్ ల‌క్ష్మి ప‌బ్లిసిటీ స్టంట్!

Update: 2021-12-05 00:30 GMT
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ- న‌టి రాయ్ ల‌క్ష్మి కొన్నేళ్ల క్రితం కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ధోనీ కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో అమ్మ‌డు అత‌గాడితో ప్రేమ‌లో ప‌డింది. ఇద్ద‌రు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. స‌హ‌జీవ‌నం చేసారు. పెళ్లి కూడా చేసుకుంటార‌ని మీడియాలో జోరుగా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. క‌ట్ చేస్తే సీన్ రివ‌ర్స్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య అనుకోకుండా బ్రేక‌ప్ జ‌రిగింది. కార‌ణాలు ప‌క్క‌న‌బెడితే ధోనీ ఆ త‌ర్వాత చిన్న నాటి స్నేహితురాలైన సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ధోనీ క్రికెట్ కి గుడ్ బై కూడా చెప్పేసాడు. రాయ్ ల‌క్ష్మి కెరీర్ కూడా చ‌ర‌మాంకంలో ఉంది.

ఇద్ద‌రి బ్రేక‌ప్ జ‌రిగి దాదాపు 12 సంవ్స‌త‌రాలు గ‌డిచిపోయింది. జ‌నాలు ఆ విష‌యం మ‌ర్చిపోయారు. అయితే పాత ప్రేమ క‌థ‌ని మ‌ళ్లీ రాయ్ ల‌క్ష్మి త‌వ్వి తీసింది. ఇంకా పెళ్లి కాని రాయ్ ల‌క్ష్మి మ‌ళ్లీ ధోని పేరుని మీడియాలో హైలైట్ చేస్తోంది. ధోనీతో రిలేష‌న్ షిప్ ఓ మ‌చ్చ‌లా మిగిలిపోయింద‌ని వాపోయింది. 12 ఏళ్లు గ‌డిచినా ఇంకా ధోనీ మాజీ ల‌వ‌ర్! అంటూ కామెంట్లు చేస్తున్నట్లు తెలిపింది. ధోనీ గురించి మీడియాలో ఏదైనా అంశం గురించి చ‌ర్చ జ‌రిగిన‌ప్ప‌డు త‌న పేరును లాగుతున్నార‌ని చెప్పింది. నాకు పెళ్లై..పిల్ల‌లు క‌లిగిన త‌ర్వాత కూడా ధోనీతో త‌న‌కున్న రిలేష‌న్ గురించి ఆ పిల్ల‌లకి కూడా చెబుతారామే అంటూ సెటైర్ వేసింది. ఏడాది పాటు డేటింగ్ అనంత‌రం సామ‌ర‌స్యంగా విడిపోయిన‌ట్లు తెలిపింది.

మ‌రి ఇంత‌కీ రాయ్ ల‌క్ష్మి ఇప్పుడు ధోనీ సంగ‌తి ఎందుకు త‌న‌కు తానుగానే తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్లు? వాళ్లిద్ద‌రి రిలేష‌న్ గురించి ఎక్క‌డా ఎలాంటి వార్త రాలేదు. బ్రేక‌ప్ త‌ర్వాత మీడియా సైతం ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయింది. సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో ఇలాంటివి చాలా స‌హ‌జం. రిలేష‌న్ లో ఉన్న‌ప్పుడు ప్ర‌చారం..విడిపోయిన త‌ర్వాత బ్రేక‌ప్ వార్త‌లు స‌హ‌జం. ఆ త‌ర్వాత వాటిని కంటిన్యూ చేయాల్సినంత అవ‌స‌రం లేద‌న్నది కొంత మంది అభిప్రాయం. అయితే ధోనీ పేరును మ‌ళ్లీ ఇలా తెరపైకి తీసుకురావ‌డం రాయ్ ల‌క్ష్మి ప‌బ్లిసిటీ స్ంట్ లా ఉంద‌ని నెటి జ‌నులు కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News