మరో సినీ దిగ్గజాన్ని మింగేసిన 2020

Update: 2020-07-09 12:10 GMT
నీకు.. నాకు.. టాలీవుడ్.. కోలీవుడ్ కు అనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా 2020 సంవత్సరం చేదు అనుభవాలు మిగిల్చింది. ఇంకా ఈ ఏడాదిలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంటూ ప్రతి ఒక్కరు ఆందోళనతో ఉన్న సమయంలో మరో దారుణం జరిగింది. బాలీవుడ్ లో దాదాపు 400 సినిమాలకు పైగా చేసిన ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూశారు. షోలే సినిమాతో ఇండియన్ సినీ ప్రేక్షకులు హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జగదీప్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నవ్వించాడు.

81 ఏళ్ల ఈ కమెడియన్ గత కొంతకాలంగా వృధ్యాప్యం తెచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న ఆయన నిన్న రాత్రి శ్వాస అందక తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. జగదీప్ బాలీవుడ్ లో దాదాపుగా 30 ఏళ్ల పాటు నటించి అలరించారు. 10 ఏళ్ల వయసులోనే సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన జగదీప్ 1990 వరకు చాలా బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగారు.

బాలీవుడ్ లోని అప్పటి స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించిన జగదీప్ వారసులు ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. జావేద్ జాఫ్రీ ఇంకా నవేద్ జాఫ్రీ లు ఇద్దరు కూడా జగదీప్ కొడుకులు. జగదీప్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో నివాళ్ళు అర్పించారు.
Tags:    

Similar News