భరత్ కోసం కాలా

Update: 2018-04-23 07:43 GMT
బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న భరత్ అనే నేను జోరు తమిళనాడులో కూడా మామూలుగా లేదు. మూడు రోజులకే తమిళనాట ఒక కోటికి పైగా గ్రాస్ రాబట్టిన భరత్ అనే నేను మీద రజనీకాంత్ దృష్టి కూడా పడింది. ప్రేక్షకుల స్పందన వస్తున్న వసూళ్లు చూసి దీన్ని చూడాలనే కాంక్ష వెలిబుచ్చినట్టు సమాచారం. రాజు తలచుకోవాలే కాని దెబ్బలకు కొదవా. ఆ మేరకు తలైవా ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ స్క్రీనింగ్ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ అన్ని కుదిరితే మహేష్ ఫ్యామిలీ కూడా కంపెనీ ఇచ్చే అవకశాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్స్ ఏవి లేవు కనక రజనీకాంత్ చాలా రిలీఫ్ గా ఉన్నాడు. ఇటీవలే ప్రభుదేవా మెర్క్యూరీ చూసి యూనిట్ మొత్తాన్ని అభినందించాడు. దానికి కారణం ఉంది లెండి. మెర్క్యూరీ దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్ తోనే రజని కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సో భరత్ అనే నేను సూపర్ స్టార్ రజనికాంత్ చూడబోతున్నారు అనే వార్త ఫాన్స్ కు బాగా కిక్ ఇస్తోంది. సమ్మె పుణ్యమా అని గత నెలన్నర రోజులుగా తమిళనాడులో ఒక్క భారీ సినిమా కూడా విడుదల కాలేదు. అందుకే రంగస్థలం-భరత్ అనే నేను భారీ వసూళ్లు రాబట్టుకోవడానికి మార్గం దొరికింది. మహేష్ కూడా ఎప్పటి నుంచో తమిళ్ మార్కెట్ లో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భరత్ అనే నేను అది నెరవేరుస్తుందనే ధీమాలో ఉన్నాడు. పైగా సమ్మె పూర్తైనా మొన్న శుక్రవారం మెర్క్యూరీ తప్ప ఏ తమిళ సినిమా విడుదల కాలేదు. అది కూడా భరత్ కు కలిసి వచ్చిన అంశమే. మరి రజనీకాంత్ స్వయంగా చూడబోతున్నాడు అంటే భరత్ అనే నేనుకి తమిళనాడులో అంత కంటే ప్రమోషన్ ఇంకేం కావాలి.

Tags:    

Similar News