ట్ర‌యినెక్కిన టాలీవుడ్‌!

Update: 2015-11-29 17:30 GMT
 ట్ర‌యినెక్కుతున్న టాలీవుడ్ సినిమాలు. విన‌డానికి ఇదేదో వింత‌గా అనిపిస్తుంది క‌దా!  మీరు ఇటీవ‌ల కాలంలో బ‌స్సు కానీ ట్ర‌యిన్ కానీ ఎక్కి ఉంటే ఎలాంటి సందేహం రాదు. ఎందుకంటే ఇప్ప‌డు టాలీవుడ్ సినిమాల ప‌బ్లిసిటీ కొత్త పుంత‌లు తొక్కుతోంది.  సినిమా తీయ‌డం ఒకెత్తైతే దాన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం మ‌రో ఎత్తు. అందులో భాగంగానే ద‌ర్శ‌క నిర్మాత‌లు విభిన్నంగా ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు.  

ప‌బ్లిసిటీ కేదీ కాదు అన‌ర్హం అన్నంత‌గా ఆలోచిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన సైజ్ జీరో సినిమా పోస్ట‌ర్స్ ప్ర‌తి బ‌స్సు, ట్ర‌యిన్ల‌పై ద‌ర్శ‌న‌మిచ్చాయి. రోజుకి కొన్ని ల‌క్ష‌ల మంది బ‌స్సుల్లో, రైళ్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు, వారందరికీ చేరువ‌చేయాల‌న్న ఉద్దేశంతో ఇలాంటి ప‌బ్లిసిటీకి పూనుకుంటున్నారు నిర్మాత‌లు. సినిమాలో విష‌యం లేకుంటే  ప‌బ్లిసిటీ  ఎంత కొత్త‌గా చేసినా ఆడ‌టం క‌ష్టమ‌ని సైజ్ జీరో నిరూపించింద‌నుకోండి. అది వేరే విష‌యం.

 ఇక డిసెంబర్ 10న విడుద‌ల కానున్న బెంగాల్ టైగ‌ర్ కూడా  సైజ్ జీరో బాట‌లో న‌డుస్తూ...బ‌స్సు, రైళ్ల పైకి ఎక్కింది.  త‌మ‌న్నా హాట్ హాట్ అందాల‌తో తెలుగు రాష్ర్టాల‌ను ఇంత చ‌లిలోనూ వేడెక్కిస్తోంది.  మ‌రో వైపు రాశిక‌న్నా సోయ‌గాల‌తో మాయ‌జాల‌మేదో చేస్తోంది. సినిమా ఎలా ఉన్నా నిర్మాత చేస్తున్న ప‌బ్లిసిటీని బ‌ట్టి ఓపెనింగ్స్ మాత్రం గ్రాండ్‌గా ఉండ‌టం ఖాయం అంటున్నారు సినీ పెద్ద‌లు.

కిక్‌-2 అట్ట‌ర్ ప్లాఫ్ కావ‌డంతో ఈ సినిమ‌పై చాలా హోప్స్‌తో ఉన్నాడు ర‌వితేజ‌. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్స్ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.  మాస్ ఆడియ‌న్స్ ప‌ల్స్ బాగా తెలిసిన సంప‌త్ నంది అయినా మాస్ మ‌హరాజాకి మంచి హిట్ ఇస్తాడో? లేక తుస్సుమ‌నిపిస్తాడో అని ప‌రిశీక‌లు అంటున్నారు.
Tags:    

Similar News