నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని మరోటి అఘోరా అని.. బాలయ్య ఇందులో అలా ఉండబోతున్నాడు ఇలా ఉండబోతున్నాడనే వార్తలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో బీబీ3 పై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ మధ్య బోయపాటికి నిర్మాతకి బడ్జెట్ విషయంలో ఏవో తేడాలు వచ్చాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
బాలయ్య రెమ్యూనరేషన్ తో కలుపుకుని ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్ తో తీద్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నారట. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ అంతకు మించి అవుతుందని టాక్ నడుస్తోంది. ఇటీవలే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేసిన ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం రోజుకు 40 లక్షలు ఖర్చు చేశారట. 10 రోజుల షెడ్యూల్ కి గానూ దాదాపుగా 4 కోట్లు ఖర్చు అయిందట. అయితే అది స్క్రిప్ లో లేని ఫైట్ సీక్వెన్స్ అని.. ఈ కారణంగానే నిర్మాతకి దర్శకుడికి మధ్య మళ్లీ బడ్జెట్ రచ్చ మొదలైందని ఫిలిం నగర్ వీధుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య సరసన 'అఖిల్' బ్యూటీ సయాషా సైగల్ నటిస్తోంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
బాలయ్య రెమ్యూనరేషన్ తో కలుపుకుని ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్ తో తీద్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నారట. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ అంతకు మించి అవుతుందని టాక్ నడుస్తోంది. ఇటీవలే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేసిన ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం రోజుకు 40 లక్షలు ఖర్చు చేశారట. 10 రోజుల షెడ్యూల్ కి గానూ దాదాపుగా 4 కోట్లు ఖర్చు అయిందట. అయితే అది స్క్రిప్ లో లేని ఫైట్ సీక్వెన్స్ అని.. ఈ కారణంగానే నిర్మాతకి దర్శకుడికి మధ్య మళ్లీ బడ్జెట్ రచ్చ మొదలైందని ఫిలిం నగర్ వీధుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య సరసన 'అఖిల్' బ్యూటీ సయాషా సైగల్ నటిస్తోంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.