ఈ టైటిల్ సాధిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు!

Update: 2019-05-26 11:55 GMT
ప్రియాంక చోప్రా అమెరికాకు తన బేస్ ను షిఫ్ట్ చేసిన తర్వాత బాలీవుడ్ లో  హవా అంతా దీపిక పదుకొనేదే.  'పద్మావత్' లాంటి క్రేజీ సినిమాల్లో నటించడమే కాదు.. 2017 సంవత్సరానికి మోస్ట్ డిజైరబుల్ వుమన్ కూడా నిలిచింది. అయితే 2018 లిస్టులో మాత్రం అగ్రస్థానం దీపికకు దక్కలేదు.  ఈసారి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్ లిస్టులో అలియా భట్ అగ్రస్థానంలో నిలిచింది.

టాప్ 50 లిస్టులో దీపిక.. కత్రినా కైఫ్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. శ్రద్ధా కపూర్ లాంటి ఎందరో బాలీవుడ్ భామలు ఉన్నారు. అయితే వారందరినీ వెనక్కు నెట్టి టాప్ ప్లేస్ ను సాధించడం అలియాకు పెరుగుతున్న క్రేజును సూచిస్తోంది. 'గల్లీ బాయ్' లాంటి సినిమాలతో నటిగా ప్రశంసలు అందుకుంటున్న అలియా చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.  అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర'.. రాజమౌళి 'RRR'.. కరణ్ జోహార్ 'తఖ్త్'.. ఇలా అర డజను భారీ బడ్జెట్ సినిమాలున్నాయి.  మోస్ట్ డిజైరబుల్ వుమన్ కిరీటం సాధించడం ఆమె తన స్పందన తెలుపుతూ "ఈ టైటిల్ సాధిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నన్ను మోస్ట్ డిజైరబుల్ వుమన్ గా ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ" అని చెప్పింది.

మీ దృష్టిలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్.. వుమన్ ఎవరు అని ప్రశ్నిస్తే "రణబీర్ కపూర్.. కరీనా కపూర్ ఖాన్.  వారిద్దరూ ఎప్పటికీ మోస్ట్ డిజైరబుల్" అంటూ రణబీర్.. కరీనాలకు కితాబిచ్చింది.

అలియా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయి ఉన్న సంగతి తెలిసిందే.  త్వరలోనే అలియా - రణబీర్ ఇద్దరూ పెళ్ళిపీటలు ఎక్కుతారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఈ మోస్ట్ డిజైరబుల్ వుమన్.. ఆ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ కలిసితే మోస్ట్ డిజైరబుల్ కపుల్ కావడం ఖాయం.  


Tags:    

Similar News