మెగా ఫ్యాన్స్ దాహం తీర‌బోతోందా?

Update: 2022-04-11 13:39 GMT
మెగాస్టార్ చిరంజీవి నుంచి దాదాపు రెండున్న‌రేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న`ఆచార్య‌` చిత్రం కోసం ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. `భ‌ర‌త్ అనే నేను` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత దాదాపు మూడేళ్ల విరామం అనంత‌రం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. అంతే కాకుండా ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. తండ్రి కొడుకులు ఒకే సినిమాలో తొలి సారి క‌లిసి న‌టించడంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అభిమానులే కాకుండా సినీ ల‌వ‌ర్స్ తండ్రీ కొడుకుల్ని వెండితెర‌పై ఒకే ఫ్రేమ్ లో చూడాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్ లుగా న‌టించారు. దేవాదాయ భూముల కుంభ‌కోణం నేప‌థ్యంలో అత్య‌త ప‌వ‌ర్ క‌థాంశంతో ఈ మూవీని యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్నఈ మూవీ రిలీజ్ క‌రోనా, ఒమిక్రాన్‌, ట్రిపుల్ ఆర్ కార‌ణంగా గ‌త కొంత కాలంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న ఈ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.  

ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇక మ‌రో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న పాత్ర నిడివి 25 నిమిషాల పాటు మాత్ర‌మే వుంటుంద‌ని, ఈ పాత్ర సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ లో చిరు, చ‌ర‌ణ్ న‌క్స‌లైట్స్ గా మారి ఆలీవ్ గ్రీన్ డ్రెస్సుల్లో క‌నిపించిన తీరు అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. ఓ చిరుత చూస్తుంటే మ‌రో చిరుత సెయేరులో నీరుతాగుతున్న విజువ‌ల్స్.. అదే త‌ర‌హాలో మెగాస్టార్ చూస్తుంటే చ‌ర‌ణ్ సెల‌యేరులో వాట‌ర్ తాగుతున్న వీడియో ఇటీవ‌ల నెట్టింట వైర‌ల్ గా మారి సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది.

ఈ మూవీ కోసం ప్ర‌త్యేకంగా టెంపుల్ సిటీ సెట్ ని నిర్మించి అందులో కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. ఇవి సినిమాకు హైలైట్ గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం 5:49 నిమిసాల‌కు ఆచార్య ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తోంది. గ‌త కొంత కాలంగా చిరు సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ట్రైల‌ర్ తో ప్ర‌త్యేకంగా ట్రీట్ ని ఇవ్వ‌బోతున్నారు మేక‌ర్స్ .

`ఆచార్య‌` చిరు న‌టిస్తున్న 153వ చిత్రం. దీంతో ఈ మూవీ ట్రైల‌ర్ ని 153 థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తియ్యాయి. ఇదిలా వుంటే ఆచార్య ట్రైల‌ర్ రిలీజ్ కు సంబంధించిన థియేట‌ర్ల లిస్ట్ ని రీసెంట్ గా విడుద‌ల చేసిన చిత్ర బృందం తాజాగా `ఆచార్య‌` ట్రైల‌ర్ ఓ బ్లాస్ట్ లా సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంద‌ని శాంపిల్ కి ఓ గిఫ్ ని వ‌దిలారు. చిన్న పాక‌లోంచి కాల‌ర్ ఎగ‌రేస్తూ చిరు క‌నిపించిన క్ష‌ణాల్లోనే జీప్ ల కాన్వాయ్ ముందు బ్లాస్టింగ్ జ‌రిగిన తీరు చూస్తుంటే మంగ‌ళ‌వారం ట్రైల‌ర్ తో ఆచార్యుడు బ్లాస్టింగ్ అప్ డేట్ ని ఇవ్వ‌బోతున్నాడ‌ని స్ప‌ష్ట‌వుతోంది. ట్రైల‌ర్ తో మెగా ఫ్యాన్స్ దాహం తీర‌బోతోందా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News