జగన్ తలుచుకుంటే 10 రోజుల్లో తేలేది.. దస్తగిరి సంచలనం

Update: 2023-02-06 09:57 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు కడప కేంద్ర కారాగారం గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారుల ముందు హాజరయ్యాడు.

కోర్టు విచారణ నిమిత్తం సమన్లు అందుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. గతంలో తాను చెప్పిన విషయాలన్ని అబద్ధాలని చెప్పారని.. ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు.

త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని.. తాను చెప్పిందంతా అబద్ధమైతే కేసు ఇంత వరకు ఎందుకు వస్తుంది? అని పేర్కొన్నారు. కేసును హైదరాబాద్ కు బదిలీ చేయటం శుభపరిణామంగా అభివర్ణించాడు.

తాను గతంలో అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ కానీ తలుచుకొని ఉంటే.. వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ పది రోజుల్లో తేలిపోయేదన్నారు. ఈ హత్య కేసులో ఎవరి పాత్ర ఎంతన్న విషయాన్ని సీబీఐ త్వరలోనే నిర్దారిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న కారణంగానే విచారణ ఆలస్యమవుతుందన్న దస్తగిరి.. అన్ని విషయాలు కోర్టులో చెప్పనున్నట్లు చెప్పారు. వాస్తవాల కోసం రాష్ట్రప్రజలు ఎదురుచూస్తున్నారన్న అతడి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News