ఆంధ్రా శశికళ ఎవరో తెలుసా?

Update: 2017-02-17 13:36 GMT
తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ముఖ్యంగా శశికళ సీఎం సీటు ప్రయత్నాలు, ఆ తరువాత జైలు పాలవడం ఒకెత్తయితే.. జయ ఉన్నప్పటి నుంచి కూడా శశికళ సాగించిన దందాలు కూడా మరోసారి చర్చనీయమయ్యాయి. కాగా ఏపీ పాలిటిక్సులోనూ శశికళ లాంటి పాత్ర ఒకటుందట. అయితే.. ఈ ఆంధ్ర శశికళ లేడీ కాదు, జెంట్ అని చెబుతున్నారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్.  ఇంతకీ వెల్లంపల్లి చెబుతున్న ఆ ఏపీ శశికళ ఎవరో తెలుసా.. ఇంకెవరు నారా లోకేశేనట.
    
వైసీపీలో చేరిన బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ సీఎం చంద్రబాబు - లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రెండు లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు, లోకేష్ పాల్పడ్డారన్నారు. ఆంధ్ర జయలలిత చంద్రబాబు అయితే ఆంధ్రా శశికళ నారా లోకేష్ అని వెల్లంపల్లి విమర్శించారు.
    
మంత్రులతో పిచ్చి ప్రేలాపనలను చేయించడం మాని.. ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పాలన గాలికొదిలేసి కేవలం జగన్‌ ను విమర్శించడమే పనిగా చంద్రబాబు, మంత్రులు పెట్టుకున్నారని అన్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు… ఇప్పుడు తెలుగు ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లలేని అసమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. ఏపీకి పట్టిన చీడపురుగు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.   జగన్ ఒక వీరుడిలా హోదా కోసం పోరాడుతున్నారని వెల్లంపల్లి అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News