డోపింగ్​ రాయుళ్లకు షాక్​.. పతకాలు ఇచ్చేయాలంటూ ఆదేశం

Update: 2020-09-12 07:50 GMT
ఏ క్రీడకు సంబంధించి అయినా ఆటగాళ్లకు డోపింగ్​ పరీక్షలు నిర్వహించడం సర్వ సాధారణమే. ఆటలు మొదలయ్యే ముందు కానీ లేదా ఆటలు ముగిసిన తర్వాత కానీ కచ్చితం గా డోపింగ్​ పరీక్షలు నిర్వహిస్తారు. ఆటగాళ్లు పక్క దారి పట్టి మోసాలకు పాల్పడకుండా కుండా ఉండేందుకు ఆయా క్రీడా బోర్డులు తరచుగా డోపింగ్​ పరీక్షలు  నిర్వహిస్తుంటాయి. ఒకవేళ పరీక్షల్లో విఫలం అయితే తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. బోర్డులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆటగాళ్లు గతి తప్పు తూనే ఉంటారు. తాజాగా డోపింగ్​ పరీక్షల్లో దొరికి పోయిన రెజర్లు వెంటనే తమ పతకాలను వెనక్కి ఇవ్వాలని భారత రెజ్లింగ్​ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) ఆదేశించింది. డోపింగ్ ​కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర క్రీడాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డబ్ల్యూఎఫ్​ఐ కఠినచర్యలు తీసుకుంది.


గత  నాలుగు ఖేలో ఇండియా గేమ్స్‌ లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యారు. వారికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన పతకాలు - ప్రశాంస పత్రాలను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం డబ్ల్యూఎఫ్​ఐ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  

డోపింగ్​ పరీక్షలో దొరికిపోయిన వారిలో రోహిత్‌ దహియా -మనోజ్‌ - కపిల్‌ - అభిమన్యు - వికాస్‌ కుమార్‌ - విశాల్‌ - జగదీశ్‌ - రోహిత్‌ - విరాజ్‌ - వివేక్‌ - జస్‌ దీప్‌ సింగ్‌ - రాహుల్‌ కుమార్‌ ఉన్నారు. వీరి పేర్లను సూచిస్తూ ఆయా రాష్ట్ర సంఘాలను ఇందులో భాగం కావాల్సిందిగా డబ్ల్యూఎఫ్‌ఐ ఆదేశించింది.
Tags:    

Similar News