ఆ సీఎం మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డ్డారు

Update: 2017-04-22 11:15 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. మాండ్యా ఎస్పీని బహిరంగ సభ వేదికపై దూషించారు. యూజ్ లెస్ ఫెలో అంటూ బహిరంగంగా తిట్టారు.  మాండ్యాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సిద్ధరామయ్య కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పలు సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అసహనానికి గురైన సిద్ధరామయ్య...వేదికపై మాండ్యా ఎస్పీ సుధీర్ రెడ్డిపై ఫైరయ్యారు. యూజ్ లెస్ ఫెలో అంటూ హూంక‌రించారు. విప‌క్షాల‌కు ప‌నేమీ లేద‌ని, ఆందోళ‌న చేయ‌డ‌మే వారి ఉద్దేశ‌మా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాగా ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్య తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ ప్రశ్నించాయి.  స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళితే ఇంత అహంకారం ప‌నికిరాద‌ని బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  మ‌రోవైపు ఈ ప‌రిణామాన్ని కాంగ్రెస్ శ్రేణులు సైతం త‌ప్పుప‌ట్టాయి. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు ఉన్న స‌మ‌యంలో ఇలా సీఎం వివాదంలో కూరుకుపోవ‌డం ఇబ్బందిక‌ర‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News