తల్లి మెడపై కత్తిపెట్టి హల్ చల్..ఏం డిమాండ్​ చేశాడంటే!

Update: 2020-10-02 07:00 GMT
ఒడిశా రాజధాని భువనేశ్వర్​ నడిరోడ్డులో ఓ వ్యక్తి ఉన్నట్టుండి తన తల్లి మెడపై కత్తి పెట్టాడు. తన డిమాండ్లు నెరవేర్చకుంటే ఆమె గొంతు కోస్తానంటూ హల్​చల్​ చేశాడు. దీంతో  ఆ రోడ్డంతా ఫుల్​ ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంతకీ డిమాండ్​ ఏమిటని అడగగా  ‘భువనేశ్వర్​ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న చాలా మంది అవినీతిలో కూరుకుపోయారు. వెంటనే వాళ్లను అరెస్ట్​ చేయాలి. లేదంటే నేను నా తల్లి గొంతుకోసి చంపేస్తా’ అంటూ చెప్పాడు సదరు యువకుడు. దీంతో అక్కడున్న ప్రజలంతా షాక్​ అయ్యారు. న్యూస్​ చానళ్లలో బ్రేకింగ్​ న్యూస్ ​లు వచ్చాయి. ఈ ఘటన భువనేశ్వర్​ లోని అసెంబ్లీ ఎదురుగా జరగడం గమనార్హం. మరోవైపు లోపల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏం చేయాలో పాలుపోక పోలీసులంతా తీవ్రంగా ఆలోచించారు. చివరకు చాకచక్యంతో ఓ పోలీస్​ యువకుడి చేతిలోనుంచి కత్తిని లాక్కొన్నాడు. సదరు యువకుడికి మానసిక స్థితి బాగాలేనట్టు సమాచారం.

ఇటీవల కొంతకాలంగా ప్రభుత్వం, నేతలపై దుర్భాషలాడుతూ రోడ్డు మీద తిరుగుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని తల్లి యువకుడిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అసెంబ్లీ ఎదురుగా ఇలా చేశాడు. చివరకు పోలీసులు ఆ తల్లీ కొడుకులను తమ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతడి అవినీతి పరుల గురించి డిమాండ్​ చేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోషల్​మీడియాలో ఈ ఘటనపై ట్రోల్స్​ మొదలయ్యాయి.
Tags:    

Similar News