''రూపాయి'' కోసం రూ.1.14ఖర్చు చేస్తున్నారే

Update: 2015-07-02 08:54 GMT
అప్పుడెప్పుడో జమానాలో చలామణీలో ఉన్న రూపాయి నోటును మళ్లీ మరోమారు జనసామ్యంలోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో చలామణీలోకి వస్తాయని భావిస్తున్న రూపాయి నోటుకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

రూపాయి విలువ చేసే ఈ నోటు తయారీ కోసం ఏకంగా రూపాయి పద్నాలుగు పైసలు ఖర్చు చేయాల్సి వస్తోందట. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ రూపాయి నోటు కోసం రిజర్వ్‌బ్యాంకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందట.ఈ సరికొత్త రూపాయి నోటుకు సంబంధించిన ప్రింటింగ్‌ ఇప్పటికే స్టార్ట్‌ అయ్యిందని చెబుతున్నారు.

రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌లో కొత్త రూపాయి నోట్లను ప్రింటింగ్‌ చేస్తున్నారట. రూపాయి నోటు ఖర్చు విషయం బయటకు వచ్చినప్పటికీ ఇంతకీ ఆ రూపాయి నోటు ఎలా ఉంటుందన్న విషయం మాత్రం బయటకు రాలేదు. మొత్తానికి నోటు విలువ కంటే.. నోటు తయారీ విలువ ఎక్కువగా ఈ సరికొత్త నోటు ఎప్పటికి బయటకు వస్తుందో..?

Tags:    

Similar News