భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ కరోనా కేసులు పూర్తిగా కట్టడి కాలేదు. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలను కూడా వైద్య నిపుణులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం మహమ్మారి నుంచి బయటపడి మునుపటి పరిస్థితికి వెళ్లొచ్చని చెప్పారు. మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ముఖ్యంగా పండుగల సీజన్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రస్తుతం తిరోగమనంలో సాగుతోందని... ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకురాకూడదని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకూడదని చెప్పారు.
దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా నుంచి 28,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది. నిన్న కరోనాతో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,658కి పెరిగింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 3,01,442 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 3,28,76,319 మంది కోలుకున్నారు. కేరళలో నిన్న 17,983 కరోనా కేసులు నమోదు కాగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 71,04,051 డోసుల కరోనా వాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రస్తుతం తిరోగమనంలో సాగుతోందని... ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకురాకూడదని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకూడదని చెప్పారు.
దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా నుంచి 28,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది. నిన్న కరోనాతో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,658కి పెరిగింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 3,01,442 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 3,28,76,319 మంది కోలుకున్నారు. కేరళలో నిన్న 17,983 కరోనా కేసులు నమోదు కాగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 71,04,051 డోసుల కరోనా వాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.