ఏపీలో పవన్-బీజేపీ కలిసినా.. వీరితో కలిసి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగనే గెలుస్తాడని కుండబద్దలు కొట్టారు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తృతీయ శక్తిగా ఎదిగినా జనాలు నమ్మరంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఏపీలో ఎంతటి మహామహులు వచ్చినా జగన్ ఉన్నంత వరకు ఆయనదే గెలుపు అని అన్నారు.
ప్రజలెప్పుడూ మంచోళ్లను, సమర్థంగా ప్రజలతో నిలబడేవారినే గెలిపిస్తారని.. అల్లాటప్పాగా రాజకీయాలు చేసేవారిని కాదంటూ పోసాని హాట్ కామెంట్స్ చేశారు. ఎంతమంది వచ్చినా తమకు ఉపయోగపడేవారినే గెలిపిస్తారంటూ చెప్పుకొచ్చాడు.
ఇక గడిచిన హయాంలో చంద్రబాబు ఎన్ని కోట్లు వృథా చేసినా.. పోలవరం కట్టకపోయినా.. ప్రజాధనం లూటీ చేసినా కూడా ఈ కోర్టులు, వ్యవస్థలు ఏమీ చేయలేదని.. అసలు చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని పోసాని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రోడ్డున వెళ్లే వాళ్లు కూడా జగన్ సర్కార్ పై కోర్టులకు వెళుతున్నారని.. తాను కూడా ఏం మాట్లాడిన కోర్టులకు వెళుతారనే తాను వ్యాఖ్యానించడం లేదని పోసాని చెప్పుకొచ్చాడు. నాకు లీగల్ తెలియదని.. అంత శక్తి లేదని.. కానీ మోరల్ ఉందంటూ చెప్పుకొచ్చాడు.
జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోనని పోసాని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక నా ఇంటికి మనుషులను పంపించారని.. ఏ పదవి కావాలో తెలుసుకోవాలని పంపించారని.. కానీ తనకు ఏ పదవి వద్దని జగన్ కు చెప్పానని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు.
ప్రజలెప్పుడూ మంచోళ్లను, సమర్థంగా ప్రజలతో నిలబడేవారినే గెలిపిస్తారని.. అల్లాటప్పాగా రాజకీయాలు చేసేవారిని కాదంటూ పోసాని హాట్ కామెంట్స్ చేశారు. ఎంతమంది వచ్చినా తమకు ఉపయోగపడేవారినే గెలిపిస్తారంటూ చెప్పుకొచ్చాడు.
ఇక గడిచిన హయాంలో చంద్రబాబు ఎన్ని కోట్లు వృథా చేసినా.. పోలవరం కట్టకపోయినా.. ప్రజాధనం లూటీ చేసినా కూడా ఈ కోర్టులు, వ్యవస్థలు ఏమీ చేయలేదని.. అసలు చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని పోసాని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రోడ్డున వెళ్లే వాళ్లు కూడా జగన్ సర్కార్ పై కోర్టులకు వెళుతున్నారని.. తాను కూడా ఏం మాట్లాడిన కోర్టులకు వెళుతారనే తాను వ్యాఖ్యానించడం లేదని పోసాని చెప్పుకొచ్చాడు. నాకు లీగల్ తెలియదని.. అంత శక్తి లేదని.. కానీ మోరల్ ఉందంటూ చెప్పుకొచ్చాడు.
జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోనని పోసాని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక నా ఇంటికి మనుషులను పంపించారని.. ఏ పదవి కావాలో తెలుసుకోవాలని పంపించారని.. కానీ తనకు ఏ పదవి వద్దని జగన్ కు చెప్పానని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు.