కరోనా హాట్‌స్పాట్ ‌గా దేశ ఆర్థిక రాజధాని

Update: 2020-07-07 17:31 GMT
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పుడు దేశంలో ముంబై కరోనాకి హాట్ స్పాట్ గా మారింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ముంబై సహా మహారాష్ట్ర ను తీవ్రంగా వణికిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ముంబై లో ఇప్పటివరకూ 85,724 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 4938కి పెరిగింది.

ఇక చైనా లో కరోనా మృతులు 4634 కాగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 83,565గా నమోదైంది. ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావి ప్రాంతం నుంచి వెల్లడయ్యే కేసుల కంటే తక్కువగా చైనాలో రోజూ పది లోపు తాజా కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై 1 నుంచి ముంబైలో రోజూ 1100కి పైగా తాజా కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో రికవరీ రేటు 67 శాతంగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. ఇక 2,11,987 కరోనా వైరస్‌ కేసులతో మహారాష్ట్ర ఇప్పటికే టర్కీని 2,05,758 దాటేసింది. రెండులక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైన మహారాష్ట్ర లో మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 9026 మంది మరణించారు.
Tags:    

Similar News