లాక్‌ డౌన్:భారత్ కి వస్తున్న NRI లు ..ప్రయాణంలో అనుభవాల్ని షేర్ చేసిన ఓ NRI

Update: 2020-05-12 09:50 GMT
ఈ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తం దాదాపుగా గత 40 రోజులుగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. ఈ లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయడంతో ..ఎక్కడ ఉన్నవారు అక్కడే చిక్కుపోయారు. ఎంతోమంది భారతీయులు ..తమ దేశానికీ రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ , అప్పుడు వారికీ కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అయితే , తాజాగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయుల్ని ఇండియా కి తీసుకురావడానికి కేంద్రం ప్రత్యేక విమానాలను నడుపుతుంది.

ఇందులో భాగంగా మేఘన అనే ప్రయాణికురాలు లండన్ నుంచి బెంగూళురు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విమాన ప్రయాణం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఇది వరకు ఈ ప్రయాణం రొటీన్‌ గా ఉండేది. కానీ ఇప్పుడు అలాలేదు . కరోనా టైమ్‌ కాబట్టి భౌతిక దూరం పాటిస్తూ ఫ్లైట్ ఎక్కారట. ఈ సందర్భంగా తనలాగ ఎవరైనా భారత్ ‌కు వస్తే.. తన అనుభవాలు వారికి పనికివస్తాయన్న ఉద్ధేశ్యంతో ఆమె పలు ట్వీట్స్ చేసింది.

ముఖ్యంగా ఇండియా కి రావాలనుకునేవారికి .. ఫ్లైట్ ఎక్కకముందే వారి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ అన్నీ చెక్ చేసి, వారికీ పూర్తిగా ఆ మహమ్మారి లక్షణాలు లేవని తెలిస్తేనే వారికి స్టాంప్ వేసి ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇస్తున్నారట. అలాగే గతంలో విమానాల్లో వేడి వేడి మీల్స్ ఇచ్చేవారట. కానీ , ఇప్పుడు ప్యాకింగ్ మీల్స్, అలాగే మొత్తం మీల్స్ సరిపడా వాటర్ ఇస్తున్నారు అని తెలిపింది. ఇక, ఇది వరకు విమానంలో వాష్ రూమ్ ‌కి వెళ్లాల్సి వస్తే కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుడు అన్‌ లిమిటెడ్. ఎన్నిసార్లైనా వాష్ రూమ్ ను వాడుకోవచ్చు అని తెలిపింది. కాగా ఫ్లైట్‌లో 30 శాతం మందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు లేవు అని, అయితే కొంతమంది మాత్రం సేఫ్టీ కోసం.. మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకున్నట్లు ఆమె తెలిపింది. ఇక బెంగుళూరులో ఫ్లైట్ దిగిన తర్వాత అందర్నీ భౌతిక దూరం పాటిస్తూ బస్సులు ఎక్కించి, క్వారంటైన్ కోసం ఎంపిక చేసిన మంచి హోటల్ గదులకు తీసుకువెళ్తున్నట్లు ఆమె తెలిపింది.
Tags:    

Similar News