మోడీ రావద్దని ఆ దేశాలు కోట్లు కుమ్మరించాయి!!

Update: 2019-04-18 10:52 GMT
రెండో విడత ఎన్నికలు ముగిసినా ఇంకా బీజేపీకి అనుకున్న హైప్ రాకపోవడంతో ఇప్పుడు కీలక ఎన్నికలకు ముందు తన అమ్ముల పొదిలోని అస్త్రాలను కమలదళం బయటకు తీస్తోంది. ఇందులో భాగంగా బుధవారం బీజేపీ ప్రచారంలోకి యోగా గురువు బాబా రాందేవ్ ను బీజేపీ రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి పిలుపురాగానే రంగంలోకి దిగిన రాందేవ్ జైపూర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. బీజేపీ నేతలను మించి ఆయన ప్రసంగంలో వ్యాఖ్యలు చేయడం విశేషం.

దేశభద్రత బీజేపీ చేతుల్లోనే ఉందంటూ రాందేవ్ బాబు ప్రజల్లో దేశభక్తిని తట్టిలేపేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా మోడీనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ రావద్దని దేశవ్యాప్తంగా ముస్లిం - క్రిస్టియన్ దేశాలు కోట్ల రూపాయలను సమకూర్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక మోడీ ఏం తప్పు చేశారని తప్పిస్తున్నారని రాందేవ్ ప్రశ్నించారు. ఎలాంటి స్వప్రయోజనాలు లేని మోడీని తిరిగి గెలిపించుకోవాలని.. కుటుంబంతోపాటు సొంత ఇల్లు కూడా మోడీకి లేదని.. దేశం మోడీ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని రాందేవ్ బాబా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మూడో విడత ఎన్నికలకు ముందర రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


Tags:    

Similar News