కృష్ణ జలాలు కొల్లగొడుతారా? వైసీపీ ప్రభుత్వం పై నాగం నిప్పులు

Update: 2020-08-03 04:45 GMT
వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి. కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణ జలాల్లో వాటా కంటే ఎక్కువే తీసుకుపోతోందని విమర్శించారు.

ఇక వైసీపీ ప్రభుత్వం కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా.. కేసీఆర్ వైఖరి తనను తీవ్రంగా కలిచివేస్తోందని నాగం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంటనే టెండర్లు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒకసారి పనులు ప్రారంభిస్తే వాళ్లు ఆపరని.. వెంటనే సుప్రీం కోర్టులో కేసు వేసి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పనులను ఆపాలని సీఎం కేసీఆర్ ను నాగం డిమాండ్ చేశారు.
Tags:    

Similar News