ముద్ర‌గ‌డ లేకుండానే ముందుకుపోతార‌ట‌

Update: 2017-01-23 05:15 GMT
కాపు నేత ముద్రగడ పద్మనాభం లేకుండానే సొంతంగా ముందుకుపోయేందుకు కాపు నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. తమకు రాజకీయ ప్రయోజనాలకంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్న కాపు నేతలు ముద్రగడను వ్యతిరేకించడం లేదని అంటున్నారు. ఈనెల 25న కాపు నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యగ్రహ యాత్ర నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు - కాపు రిజర్వేషన్‌ సంక్షేమ సమితి (కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణు అధ్యక్షతన రాజమహేంద్రవరంలో రహస్య సమావేశం జరగడం ముద్రగడ శిబిరంలో కలకలం రేపింది.

కాకికాడ రూరల్‌ లో కాపు జేఏసీ నాయకులు కూడా ఆదివారం రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సత్యగ్రహయాత్ర నిర్వహించి తీరుతామని మీడియా సమావేశంలో ప్రకటించారు. తాము ముద్రగడ ప‌ద్మ‌నాభంకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకం కాదని, నాయకులకంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ముద్రగడ సాధిస్తే ఆయనను తలకెత్తుకుంటామని, చంద్రబాబు రిజర్వేషన్‌ కల్పిస్తే ఆయనను తలకెత్తుకుంటామని కాపు రిజర్వేషన్‌ సంక్షేమ సమితి నాయకులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News