ఉప ముఖ్యమంత్రికి అస్వస్థత

Update: 2020-09-20 06:45 GMT
తమిళనాట రాజకీయాల్లో కలకలం చోటుచేసుకుంది. అమ్మ జయలలిత నమ్మినబంటు.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకేలో కీలక నేత అయిన పన్నీర్ సెల్వం ఆస్పత్రిపాలు కావడం.. సీరియస్ గా ఉన్నారన్న వార్తలు కలకలం రేపాయి. ప్రస్తుతం తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఆయనే సీఎం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. .

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చిందని.. అందుకే ఆస్పత్రిలో చేర్చినట్టు వార్తలు వస్తున్నాయి.  దీంతో ఆయనను చెన్నైలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

అయితే రెగ్యులర్‌ చెకప్‌ కోసమే వెళ్లారని సన్నిహితు చెబుతుండగా.. తీవ్రమైన సమస్య కాదని వైద్యులు ప్రకటించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లారని వార్తలు రావడంతో క లకలం రేపింది. ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
Tags:    

Similar News