హైదరాబాద్​ బిర్యానీ తిని అస్వస్థత.. ! ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆస్పత్రిపాలు..!

Update: 2021-02-07 06:10 GMT
హైదరాబాద్​ బిర్యానీ  తిని ఓ కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. మల్కాజ్​గిరికి చెందిన ఓ కుటుంబం .. ఇటీవల ఆనంద్‌ బాగ్‌ లోని 'మజ్లిస్‌ అల్‌ మండి' లో బిర్యానీ  తిన్నారు. వివాహ వార్షికోత్సవం ఉండటంతో ఆ కుటుంబం మొత్తం కలిసి.. ఓ హోటల్​కు వెళ్లింది. బిర్యానీ  తిన్నాక కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఆ కుటుంబంలోని ఐదుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ అయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వెంటనే సదరు హోటల్​పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్​ అంటే టక్కున గుర్తుకు వచ్చేది బిర్యానీ. అంతలా బిర్యానీ  ఫేమస్​ అయ్యింది. సొంత పనుల కోసం  వివిధ పట్టణాల నుంచి నగరానికి  వచ్చిన వాళ్లు హైదరాబాద్​ బిర్యానీ  రుచి చూడకుండా వెళ్లరు.

 హైదరాబాద్​లో ఉండేవాళ్లు కూడా వారానికోసారైనా రెస్టారెంట్​ కు వెళ్లి బిర్యానీ తింటుంటారు. నగరంలో ఉన్న ప్రతి రెస్టారెంట్​లో బిర్యానీ  ఉంటుంది. అటువంటింది ఇప్పుడు హైదరాబాద్​లోని ఓ ప్రముఖ రెస్టారెంట్​లో బిర్యానీ ఫుడ్​ పాయిజన్​ కావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ  విషయంపై హోటల్​ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
Tags:    

Similar News