భర్త దారుణం.. ముగ్గురితో కలిసి భార్యపై రేప్

Update: 2020-08-02 06:30 GMT
కట్టుకున్న భర్తే.. తన భార్యపై దారుణంగా ప్రవర్తించాడు. ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణమైన ఘటన కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నియోజకవర్గంలో ఫీలిబీత్ లో ప్రభుత్వ అంబులెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి.. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో 2016లో పెళ్లయ్యింది. పెళ్లి అయిన 3 నెలల నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.

పెద్దలు, పోలీసులు మరోసారి ఈ జంటను కలిపి మరోసారి కాపురం నిలబెట్టారు. అయితే భర్త తీరు మారలేదు. ఎలాగైన భార్య నుంచి డబ్బు గుంజాలని కిడ్నాప్ ప్లాన్ చేశాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి మరో ప్రాంతానికి తీసుకెళ్లి 4 రోజుల పాటు తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిత్రహింసలు పెట్టి ఆమె రైల్వే ట్రాక్ పై పడేసి వెళ్లిపోయాడు.

ఎలాగోలా పోలీస్ స్టేషన్ చేరి ఫిర్యాదు చేసింది మహిళ.. భర్తను, ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు.
Tags:    

Similar News