ఒక్క సెంచరీ చేస్తే మూడు రికార్డులు.. కోహ్లీకి మంచి చాన్స్​..!

Update: 2020-12-17 03:14 GMT
టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్​ సీరీస్​లో ఒక్క సెంచరీ చేస్తే మూడు రికార్డులు బద్దలు కొట్టనున్నాడు.  గురువారం అడిలైడ్ వేదికగా పింక్​ బాల్​ టెస్ట్​ క్రికెట్​ ప్రారంభం కానున్నది. అయితే ప్రతి మ్యాచ్​లోనూ పరుగులే లక్ష్యంగా ఆడే విరాట్​ ఇప్పుడు రికార్డులు నెలకొల్పడం ఖాయమని  విరాట్​ అభిమానులు అంటున్నారు. అయితే ఈ సీరిస్​లో విరాట్​ గనక 180 పరుగులు సాధిస్తే.. అడిలైట్​ స్టేడియంలో అత్యధిక పరుగులు సాధించిన నాన్​ ఆస్ట్రేలియన్​ ఆటగాడికి రికార్డు నెలకొల్పనున్నాడు.

 ఇప్పటివరకు ఇక్కడ వెస్టిండీస్​ ఆటగాడు లారా 4 మ్యాచ్​ ల్లో 610 పరుగులు చేసి రికార్డ్​ నెలకొల్పాడు. అయితే మూడు మ్యాచ్​లు ఆడిన కోహ్లీ 431 రన్స్​ చేశాడు.  ఆస్ట్రేలియాలో 20 టెస్టులు ఆడిన సచిన్​ 1809 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. అయితే విరాట్​ మాత్రం కేవలం 12 టెస్టుల్లోనే 1274 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు విరాట్​ మరో సెంచరీ చేస్తే సెంచరీ ల్లో సచిన్​ రికార్డు ను బ్రేక్​ చేయనున్నాడు.


కెప్టెన్​గా విరాట్​ కోహ్లీ ఇప్పటివరకు 41 సెంచరీలు చేశాడు. ఆసీస్​ మాజీ కెప్టెన్ కూడా పాంటింగ్​ 41 సెంచరీలు చేశాడు. అయితే ఇప్పుడు విరాట్​ సెంచరీ చేస్తే.. ఆ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.  ఇప్పటివరకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ​లో 70 సెంచరీలు చేశాడు. సచిన్​ వంద, రికి పాంటింగ్​ 71 స్థానాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే విరాట్​ మరో సెంచరీ చేస్తే రెండో స్థానం లోకి వెళతాడు. ఏది ఏమైనా విరాట్​కు ఈ టెస్ట్​ సీరిస్​ రికార్డుల మోత మోగించనున్నది. ఫ్యాన్స్ కూడా విరాట్ రికార్డులు ఎప్పుడెప్పుడు బద్ధలు కొడతాడా అని ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News