గోఎయిర్ విమానం..అత్యవసరంగా పాక్ ​లో ల్యాండ్​..ఇంతకీ ఏం జరిగింది?

Update: 2020-11-18 10:10 GMT
రియాధ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఓ విమానం అర్జెంట్​గా పాకిస్థాన్​ లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యింది. అయితే ఓ ప్రయాణికుడికి (30) అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చిందట. అయితే గుండెపోటుకి గురైన వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. రియాధ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన గోఎయిర్ G8-6658A విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి  మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. దీంతో ఫైలట్​ విమానాన్ని  కరాచీలో జిన్నా ఎయిర్ ​పోర్ట్​లో ల్యాండ్ చేశారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నట్లు తెలిపింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలోనూ పలుమార్లు విమానాలు అత్యవసరంగా ల్యాండ్​ అయ్యాయి. రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌ కు చెందిన ఓ విమానం జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం తలుపు తెరుచుకున్నట్లు గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరాడు.

అయితే నిన్న విమానం కరాచీలో ల్యాండ్​ అయినట్టు వార్తలు రావడంతో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. విమానం దాయాది దేశమైన పాకిస్థాన్​ లో ల్యాండ్​ కావడమే అందుకు కారణం. చివరకు మెడికల్ ఎమర్జెన్సీ అని తెలియడం.. కొద్దిసేపటికే విమానం ఢిల్లీకి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానాలు వివిధ అత్యవసర పరిస్థితుల వల్ల వేరే చోట ల్యాండ్​ అవడం మామూలేనని విమానయానశాఖ అధికారులు తెలిపారు.
Tags:    

Similar News