తుపాకీతో బీభత్సం సృష్టించిన మాజీ మంత్రి !

Update: 2020-08-31 07:30 GMT
నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో బెదిరించిన  బీభత్సం చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో పిల్లాయిపల్లి జరుగుతున్న కాలువ పనులను మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా ... ఉరుమడ్ల శివారులో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి కి చెందిన వ్యవసాయ పొలం మీదుగా కాల్వను విస్తరిస్తుండడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తుపాకీతో పనులు చేస్తున్నవారిని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.  

సైట్‌ ఇంజినీర్‌ నరేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు గుత్తాపై కేసు నమోదు చేశారు. తుపాకీ స్వాధీనం చేసుకోవడంతోపాటు మోహన్ ‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుత్తా మోహన్ రెడ్డి 1978, 83లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో నాదెండ్ల భాస్కర్‌ రావు మంత్రివర్గంలో నెల పాటు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా తన భూమి నుంచి కాలువ వెళ్లొద్దంటూ గుత్తా వాగ్వాదానికి దిగారని ఇంజినీర్‌, జేసీబీ ఆపరేటర్ తెలిపారు. పనులు నిలిపేయాలంటూ తుపాకీతో తమని బెరించారని వాపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
Tags:    

Similar News