హోదా కోసం గాడిద పై ఊరేగింపు

Update: 2018-12-15 10:54 GMT
బంగి అనంతయ్య.. కర్నూలు జిల్లా మాజీ మేయర్.. విలక్షణ రాజకీయ నాయకుడి గా పేరుంది. ఆయన చేసే నిరసనలు వినూత్నంగా ఉంటాయి. నడిరోడ్డు పైనే ఆయన వివిధ వేషధారణల తో నిరసనలు చేస్తుంటారు. తాజా గా ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో నిరసనలు తెలుపుతున్న టీడీపీ ఎంపీలకు మద్దతుగా  బంగి అనంతయ్య కర్నూలులో వినూత్న నిరసన తెలిపారు.  ఇది అందరినీ ఆకర్షించడంతోపాటు వైరల్ అయ్యింది..

బంగి అనంతయ్య శనివారం కర్నూలు నగరంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని బుధవారంపేట నుంచి కలెక్టరేట్ వరకూ గాడిద పై ఊరేగారు. ఆ తరువాత ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుండు గీయించుకున్నారు. ఏపీ కి హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని నినదించారు. హోదా ఇవ్వకపోతే బీజేపీ కి ఏపీ లో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

రాష్ట్ర విభజన సమయంలోనూ బంగి అనంతయ్య రోజుకో వినూత్న నిరసన చేస్తూ అలరించేవారు. ఇప్పుడు పార్లమెంట్ లో ఎంపీ శివప్రసాద్ ఇలానే రోజుకో వేషంతో నిరసన తెలుపుతుంటే.. ఇక్కడ బంగి ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.
Tags:    

Similar News