ఖమ్మంలో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Update: 2021-12-27 09:08 GMT
తెలంగాణలోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. స్పాట్ లో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. చర్ల మండలానికి 25 కి.మీల దూరంలో ఉన్న కురనవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది.

ఈ ఎదురు కాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు సమాచారం. చనిపోయిన ఆరుగురు నక్సల్స్ లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్టు తెలిసింది.

తెలంగాణ గ్రేహౌండ్ పోలీసుల ఆపరేషన్ లో భాగంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది. చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కాల్పులతో చర్ల మండలం ఒక్కసారిగా ఉలికిపడింది.


Tags:    

Similar News