కరోనా చికిత్స కేవలం రూ . 28 వేలకే ..ఎక్కడంటే !

Update: 2020-08-06 09:10 GMT
కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో విలయతాండవం చేస్తుంది. ఈ సమయంలో కరోనా ట్రీట్మెంట్ చాలా భారంగా మారిపోతుంది. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు కరోనా పేరు చెప్పి  రూ. లక్షల్లో ఫజులు వసూలు చేస్తున్నాయి. సాధారణ దగ్గు, జలుబు,జ్వరం వంటి లక్షణాలు ఉండి కరోనా బాధితుడు అయితే , వారిని హాస్పిటల్ లో జాయిన్ చేపించుకొని లక్షల్లో బిల్లులు వేస్తున్నారు.  కరోనా  వైరస్‌ బారిన పడిన వారు కరోనా సోకింది అన్న భాద కంటే .. దాని ట్రీట్మెంట్ కేజీ అయ్యే ఖర్చుని చూసి భయపడుతున్నారు.  కరోనా క్రిటికల్ గా ఉన్న సమయంలో ఆసుపత్రిలో చేరి .. చనిపోయినా కూడా మానవత్వం అనేది లేకుండా శవాలతో వ్యాపారం చేస్తున్నారు . డబ్బు కడితే కానీ శవాన్ని ఇవ్వము అని కుటుంబ సబ్యులని బెదిరిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా  పేషెంట్‌లకు గట్టి భరోనాను ఇవ్వలేకపోతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేని  ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో చేరేందుకు జనం కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి  క్లిష్టమైన సమయంలో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందజేసేందుకు వంద  పడకల ‘ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌’ తో ముందుకు వచ్చింది జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్చంద సంస్థ. దాతల సహాయ సహకారాలతో పని చేస్తున్న ఈ సంస్థ  విద్య, వైద్య రంగాల్లో తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఆపద సమయంలో  బాధితులను ఆదుకొనేందుకు ఈ సంస్థ  దేశవ్యాప్తంగా  ఇప్పటికే  15  కరోనా‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా   16వ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ను హైదరాబాద్‌ లో ప్రారంభించింది. బేగంపేట్‌ లోని మానస సరోవర్‌ లో 100  పడకలతో, అన్ని రకాల సదుపాయాలతో ఈ ఆసుపత్రిని  బుధవారం అందుబాటులోకి  తెచ్చారు.  ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ  ఆసుపత్రిలో కరోనా బాధితులకు  వైద్య సేవలు లభిస్తాయి. కేవలం నామమాత్రపు ఫీజులతో అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు  జైన్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి వినోద్‌ రాంకా తెలిపారు.

ఈ హాస్పిటల్  చూస్తే .. ఒక గదిలో ఇద్దరు  చొప్పున ఉంటే  వారం రోజులకు ఒక్కొక్కరు రూ.28000 చొప్పున చెల్లిస్తే చాలు. ఒక్కరే  ప్రత్యేకంగా ఒక సింగిల్‌ రూమ్‌లో ఉండాలనుకొంటే  వారం రోజులకు రూ.35000 ఫీజు ఉంటుంది. ఈ ఫీజులోనే కోవిడ్‌ నివారణకు అవసరమయ్యే మందులు, చికిత్స, ఆక్సిజన్‌, తదితర అన్ని సదుపాయాలు లభిస్తాయి. పేషెంట్‌లు త్వరగా కోలుకొనేందుకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తారు. అయితే కేవలం శాఖాహారం మాత్రమే ఇస్తారు. ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆరుగురు వైద్య నిపుణులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. అలాగే నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రోగులను కనిపెట్టుకొని ఉంటారు.  అంబులెన్స్‌ సదుపాయం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో  రోగులను  పెద్ద ఆసుపత్రులకు తరలించే సేవలు ఉంటాయి.
Tags:    

Similar News