టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్లు.. సర్వత్రా నవ్వు తెప్పించాయి. ముఖ్యంగా టీడీపీ నేతలైతే పగలబడి నవ్వేలా చేశాయి. రాష్ట్రంలో పలు విషయాలపై సర్వే చేయించారు చంద్రబాబు. ఎమ్మెల్యేల పనితీరు - మంత్రుల వ్యవహారశైలి, ప్రజల్లో టీడీపీ పాలన ఎలా ఉంది? సీఎంగా ఆయన పనితీరు ఏవిధంగా ఉంది? ఇలాంటి అనేక విషయాలపై ఆయన సర్వే చేయించారు. ఈ సర్వేల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. మంచిగా పనులు చేసి పెడుతున్న ఎమ్మెల్యేలతోపాటు సొంత పనులు చేసుకుంటున్న ఎమ్మెల్యేల విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
ఇక, ప్రజలపై నిర్వహించిన సర్వేలో భలే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారట. తనకు అనుసంధానంగా ఉన్న కోర్ డ్యాష్ బోర్డులో ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ వార్డులను అనుసంధానం చేయడం ద్వారా ఏ రోగి ఏ జబ్బుతో వస్తున్నారో కూడా తెలిసిపోతుందని సీఎం చూపించారు. ఈ సమావేశం జరిగిన రోజున తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు - పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారంటూ ఆన్ లైన్ లో వివరాలను ఎమ్మెల్యేలకు చంద్రబాబు చూపించారట. కిర్లంపూడి అంటే.. కాపు ఉద్యమానికి నేతృత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సొంత ఊరన్నమాట.
ఇక నల్లజర్ల పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్వగ్రామం. చంద్రబాబు అక్కడ బీపీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరజిమ్మాయట. అంటే.. చంద్రబాబు ఉద్దేశంలో కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు ఉన్నారు కాబట్టే ప్రతి విషయానికి ఉద్రేక పడిపోతారని ఆయన అనుకుని ఉంటారని మరికొందరు తెలుగు దేశం నేతలు అనుకోవడం వినిపించింది. ఇదైతే ఏమోకానీ.. చంద్రబాబు మాత్రం కిర్లంపూడిపై చేసిన బీపీ వ్యాఖ్యలు పార్టీ ఎమ్మెల్యేలకు సర్వత్రా హాస్యం పుట్టించాయట.
ఇక, ప్రజలపై నిర్వహించిన సర్వేలో భలే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారట. తనకు అనుసంధానంగా ఉన్న కోర్ డ్యాష్ బోర్డులో ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ వార్డులను అనుసంధానం చేయడం ద్వారా ఏ రోగి ఏ జబ్బుతో వస్తున్నారో కూడా తెలిసిపోతుందని సీఎం చూపించారు. ఈ సమావేశం జరిగిన రోజున తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు - పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారంటూ ఆన్ లైన్ లో వివరాలను ఎమ్మెల్యేలకు చంద్రబాబు చూపించారట. కిర్లంపూడి అంటే.. కాపు ఉద్యమానికి నేతృత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సొంత ఊరన్నమాట.
ఇక నల్లజర్ల పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్వగ్రామం. చంద్రబాబు అక్కడ బీపీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరజిమ్మాయట. అంటే.. చంద్రబాబు ఉద్దేశంలో కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు ఉన్నారు కాబట్టే ప్రతి విషయానికి ఉద్రేక పడిపోతారని ఆయన అనుకుని ఉంటారని మరికొందరు తెలుగు దేశం నేతలు అనుకోవడం వినిపించింది. ఇదైతే ఏమోకానీ.. చంద్రబాబు మాత్రం కిర్లంపూడిపై చేసిన బీపీ వ్యాఖ్యలు పార్టీ ఎమ్మెల్యేలకు సర్వత్రా హాస్యం పుట్టించాయట.