టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
'చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని.. త్వరగా కోలుకొని ప్రజల కోసం ఎప్పటిలాగే పనిచేయాలని కోరుకుంటున్నానని' పవన్ అన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు.
ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు , స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. కరోనా పరీక్ష కేంద్రాలను పెంచాలని.. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని మాస్క్ లేకుండా బయటకు రాకండి అని పవన్ కోరారు.
'చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని.. త్వరగా కోలుకొని ప్రజల కోసం ఎప్పటిలాగే పనిచేయాలని కోరుకుంటున్నానని' పవన్ అన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు.
ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు , స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. కరోనా పరీక్ష కేంద్రాలను పెంచాలని.. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని మాస్క్ లేకుండా బయటకు రాకండి అని పవన్ కోరారు.