బొత్స కుమారుడి వివాహం: సీఎం జగన్ సహా కదిలివచ్చిన ప్రముఖులు

Update: 2022-02-11 10:32 GMT
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు జగన్ దంపతులు... వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు.

ఇక ఈ వివాహానికి చాలా మంది సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే కం హీరో బాలకృష్ణ కూడా హాజరయ్యారు. బొత్స దగ్గరుండి అతిథులను సాదరంగా ఆహ్వానించారు.

ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

మంత్రి కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు వైసీపీ నేతలు, పెళ్లికి హాజరైన పలువురు అతిథులు పోటీపడ్డారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సైతం పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Tags:    

Similar News