మాజీ సీఎం మనమడు తనను తాను కాల్చుకున్నాడు

Update: 2016-05-29 13:36 GMT
పంజాబ్ రాష్ట్రంలో ఊహించని విధంగా చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనమడు హర్కిరాత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో తనను తాను కాల్చుకొని చనిపోయిన ఘటన అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది. చండీగఢ్ కు సమీపంలో ఉన్న తన ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తుపాకీతో తనను తాను కాల్చుకున్న విషయాన్ని గుర్తించిన వెంటనే.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్న చిన్న కష్టాలకే సామాన్యులు సూసైడ్ చేసుకోవటం మామూలే. అయితే.. ఉన్నత కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తుంది. ఏదో ఒక అంశంపై తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News