షర్మిళ కోసం సౌభాగ్యమ్మ... కొంగు నింపాలంటూ కీలక వ్యాఖ్యలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తున్న వేళ ఫైనల్ బ్యాటిల్ పీక్స్ కి చేరుకుంటుంది

Update: 2024-05-10 07:28 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తున్న వేళ ఫైనల్ బ్యాటిల్ పీక్స్ కి చేరుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజల మనసు కొల్లగొట్టడానికి నేతలంతా.. ఉన్న అన్ని ఆప్షన్లూ వాడేస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ కార్డులను తెరపైకి తెస్తున్నారు. ఉన్న ఈ కొద్ది సమయాన్ని అత్యంత విలువగా వాడుకుంటున్నారు! ఈ సమయంలో వైఎస్ వివేకా సతీమణి సౌభ్యాగ్యమ్మ కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అవును... ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఎన్నికల ఫైటు ఒకెత్తు అయితే.. కడప లోక్ సభ పరిధిలో మరో ఎత్తుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన అన్ని చోట్లా ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా సాగుతుంటే.. కడప లోక్ సభ పరిధిలో మాత్రం వైఎస్సార్ కుటుంబ సభ్యుల మధ్యే పోరు నడుస్తుంది! ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిళ... ప్రధానంగా వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్థావిస్తున్నారు!

ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టారు! ఇందులో భాగంగా... పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిళ, సునీతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా... పుట్టింటికి వచ్చిన షర్మిళ, సునీత.. చీర, సారె కాకుండా న్యాయం అడుగుతున్నారని చెప్పిన సౌభాగ్యమ్మ... షర్మిళను ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు!

ఈ సందర్భంగా... ఆడబిడ్డలిద్దరూ మీ ముందున్నారు.. వీరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.. బిడ్డలు ఐదేళ్లుగా పడుతున్న కష్టం అందరికీ తెలుసు అని అన్నారు. ఈ క్రమంలోనే... ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే చీర, సారే పెట్టి పంపిస్తామని.. అయితే ఈ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర, సారె అడగడం లేదని, న్యాయం మాత్రమే అడుగుతున్నారని సౌభాగ్యమ్మ తెలిపారు.

Read more!

ఇదే క్రమంలో... వీరికి న్యాయం చేసే సమయం వచ్చిందని, ఇందులో భాగంగా.. ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి షర్మిళను గెలిపించాలని కోరారు. షర్మిళ కొంగుపట్టి అడుగిన విషయాన్ని గుర్తుచేసిన సౌభాగ్యమ్మ... ప్రజలంతా వోట్లు వేసి ఆమె కొంగు నింపాలని కోరారు. ఫలితంగా పార్లమెంటులో అందరి సమస్యలనూ ఆమె ప్రస్థావిస్తారని సౌభాగ్యమ్మ తెలిపారు.

Full View
Tags:    

Similar News