చిరంజీవి ముంద‌రి కాళ్ల‌కు.. గీత‌మ్మ బంధం!!

అయితే..ఎంతైనా రాజ‌కీయమే క‌దా.. ఇటు వైపు నుంచి ప‌వ‌న్ వేడి పుట్టిస్తున్నారు.

Update: 2024-04-29 17:43 GMT

వంగా గీత‌. ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ విదేశాల్లోనూ మార్మోగుతోంది. దీనికికార‌ణం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో ఉన్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన కాకినాడ ఎంపీ ఈమే కావడం. ఇప్ప‌టికే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముందే అంటే.. మార్చి 16కు ముందునుంచి ఆమె పిఠాపురంలో ప‌ర్య‌టిస్తున్నా రు. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. త‌న‌దే గెలుప‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే..ఎంతైనా రాజ‌కీయమే క‌దా.. ఇటు వైపు నుంచి ప‌వ‌న్ వేడి పుట్టిస్తున్నారు.

మెగా కుటుంబంలో ముఖ్య కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే పిఠాపురంలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌చారం చేస్తున్నారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి, ఆయ‌న కుమారుడు వ‌రుణ్ తేజ్‌లు ప్ర‌చారంలో ముందున్నారు. నాగ‌బాబు స‌తీమ‌ణి అయితే.. ఇంటింటికీ ప్ర‌చారం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతేకాదు.. బొట్టు కాటుక పెట్టి మ‌రీ త‌న మ‌రిదిని గెలిపించాల‌ని కోరుతున్నారు. ఇక‌, వ‌రుణ్ తేజ్ యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఇక‌, వ్యాపార‌, ఇత‌ర‌వ‌ర్గాల‌ను నాగ‌బాబు ఆక‌ర్షిస్తూ.. ప్ర‌చారంలో దూకుడు పెంచారు. మ‌రోవైపు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు కూడా బ‌రిలో ఇంటింటికీ ప్ర‌చారం చేస్తున్నారు.

Read more!

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. రేపోమాపో..మెగా స్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలోకి వ‌స్తార‌ని.. త‌మ్ముడి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో గీత గుండెల్లో రాయి ప‌డిన‌ట్టు అయింది. ఈ నేప‌థ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ.. చిరు కాళ్ల‌కు ముందరి బంధం వేసే ప్ర‌య‌త్నం చేశారు. ``చిరంజీవి అన్న‌య్య ఇక్క‌డ‌కు రారు. పిఠాపురంలో ఆయ‌న ప్ర‌చారం చేయ‌రు. చేసినా.. గీత చెల్లిని ఓడించాల‌ని ఆయ‌న చెప్ప‌రు. ఆయ‌న ముమ్మాటికీ న‌న్ను ఓడించ‌మ‌ని ఎవ‌రికీ చెప్ప‌రు. ఆయ‌న నాకు తోడ‌బుట్టిన అన్న‌య్య‌కంటే ఎక్కువ‌`` అని వ్యాఖ్యానించ‌డం ద్వారా వంగా గీత చిరు కాళ్ల‌కు బంధం వేశారు. మ‌రి చిరు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News