హెచ్-1బీ వీసా ఫీజు షాక్.. హెల్ప్ లైన్ పెట్టిన భారత్.. ఇలా సంప్రదించండి
దరఖాస్తుదారులకు సంవత్సరానికి $100,000 (దాదాపు ₹83 లక్షలు) ఫీజు విధిస్తూ ఒక కొత్త ప్రొక్లమేషన్పై సంతకం చేయడం భారతీయ ఐటీ నిపుణులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా
దరఖాస్తుదారులకు సంవత్సరానికి $100,000 (దాదాపు ₹83 లక్షలు) ఫీజు విధిస్తూ ఒక కొత్త ప్రొక్లమేషన్పై సంతకం చేయడం భారతీయ ఐటీ నిపుణులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ అనూహ్య నిర్ణయం నేపథ్యంలో వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తక్షణ సహాయం కోసం ఒక అత్యవసర హెల్ప్లైన్ను ప్రారంభించింది.
భారత రాయబార కార్యాలయం సహాయం
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఈ పరిణామాలపై ఏవైనా సందేహాలు లేదా అత్యవసర సహాయం అవసరమైతే +1-202-550-9931 నంబర్కు (వాట్సాప్లో కూడా) సంప్రదించవచ్చని రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే సాధారణ కాన్సులర్ సేవలకు ఈ నంబర్ను ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.
*అమెరికా అధికారుల వివరణ
ఈ నిర్ణయంపై ఉన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో వైట్హౌస్ ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ భారీ ఫీజు కేవలం కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా కలిగిన వారికి లేదా పునరుద్ధరణ (renewal) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇది వర్తించదని పేర్కొంది. అంతేకాకుండా, ఇది ఒక ఒకసారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజు అని కూడా వెల్లడించింది.
*భారత ప్రభుత్వ స్పందన
భారత విదేశాంగ శాఖ ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాకు తిరిగి వెళ్లాల్సిన భారతీయ పౌరులకు అన్ని రకాల సహాయం అందించాలని తమ మిషన్లకు.. కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ “హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో చేసిన మార్పులను మేము జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. దీని ప్రభావం కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా, కుటుంబాలపై మానవతా సమస్యలకు దారితీయవచ్చని మేము భావిస్తున్నాం,” అని తెలిపారు.
*భారత ఐటీ రంగంపై ప్రభావం
ప్రస్తుతం జారీ అవుతున్న హెచ్-1బీ వీసాలలో దాదాపు 71% మంది భారతీయులకే లభిస్తున్నాయి. ఈ ఫీజు పెంపు నిర్ణయం భారత ఐటీ రంగంతో పాటు, విదేశాల నుంచి వచ్చే రిమిటెన్సుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ నిర్ణయానికి సంబంధించి భారత-అమెరికా దేశాల మధ్య దౌత్య చర్చలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.