'టీం వర్క్' లేకపోతే ఇలానే ఉంటుందా ..!
టీం వర్క్- ఇది అందరికీ ఉప యోగపడే విషయం. సాధారణ వ్యక్తుల జీవితాల్లోనేకాదు.. కుటుంబ వ్యవహా రాల్లోనూ ఇది పనిచేస్తుంది.;

టీం వర్క్- ఇది అందరికీ ఉప యోగపడే విషయం. సాధారణ వ్యక్తుల జీవితాల్లోనేకాదు.. కుటుంబ వ్యవహా రాల్లోనూ ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు ఓ ఇంట శుభకార్యం జరగాలన్నా.. టీం వర్క్ ఉండాల్సిందే. అందరూ కలిసి చేతులు కలిపితేనే.. సదరు కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. ఇక, రాజకీయాల విషయాని కి వస్తే.. టీం వర్క్ మరింత ప్రధానం. అందరూ కలసి కట్టుగా ముందుకు సాగాలి. ఈ విషయంలో ఇతర పార్టీల కంటే కూడా.. టీడీపీలోనే ఎక్కువగాటీం వర్క్ కనిపిస్తుంది.
చంద్రబాబు అంటే గౌరవం కావొచ్చు.. లేదా భయంతోనైనా కావొచ్చు. తమ్ముళ్లు కలిసి కట్టుగాపనిచేస్తారు. ఏ టాస్క్ ఇచ్చినా.. కలిసి ముందుకు సాగుతున్నారు. దీంతో సదరు పనులు పూర్తవుతున్నాయి. పార్టీ నాడి అలా నిలబడుతోంది. అయితే.. ఇతర పార్టీల విషయానికి వస్తే.. టీం వర్క్ ఎక్కువగాకనిపించడం లేదు. ముఖ్యంగా కూటమిలోనే.. బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నా.. టీం వర్క్ విషయంలో ఈ రెండు పార్టీలు విఫలమవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎటు విన్నా.. ఎక్కడ చూసినా.. టీడీపీ పేరు మాత్రమే వినిపిస్తోంది.
దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేకున్నా.. కూటమిలో ఎవరో ఒకరు ప్రజల్లో ఉంటున్నారు కదా! అని అనుకున్నా.. దీర్ఘకాలిక రాజకీయాలను బేరీజు వేసుకున్నప్పుడు.. ఇది వ్యక్తిగతంగా ఆయా పార్టీలకు ఇబ్బందికర వ్యవహారంగా మారుతుంది. ఈ విషయం ఎలా ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ లో అసలు టీం వర్క్ లేకుండా పోయింది. ఎవరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నది లేదు. అధినేత ఇచ్చిన పిలుపును కూడా.. లైట్ తీసుకుంటున్న నాయకులు కనిపిస్తున్నాయి.
దీంతో గత ఏడాది కాలంగా వైసీపీ గ్రాఫ్ను పరిశీలిస్తే.. ఎక్కడా సక్సెస్ అయిన జాబితా కనిపించడం లేదు. వాస్తవానికి ఒక్క కార్యక్రమం అయినా.. సక్సెస్ కావాలి. కానీ.. అలా జరగలేదు. దీనికి ప్రధానంగా టీం వర్క్ లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు టీం వర్క్ చేశారు. ఫలితంగా అందరూ విజయం దక్కించుకున్నారు.
కానీ.. ఇప్పుడు మాత్రం ఆ తరహా టీం వర్క్కు మంగళం పాడేశారు. కీలక నాయకులు.. ఎవరూ ఏపీలో మీడియాతో మాట్లాడరు. ప్రజల మధ్యకు రారు. అధినేత ఏదైనా చెప్పినా.. లైట్ తీసుకుంటారు. దీంతో టీం వర్క్ స్ఫూర్తి పూర్తిగా పోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీనిని డెవలప్ చేసేలా కార్యక్రమాలు నిర్వహించేలా.. జగనే చొరవ చూపించాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.