బంపర్ అఫర్ .. నిత్యానంద స్వామికి తెలియక ముందే కొనుక్కోండి

అంతా కలిపి ధర ఎంతో తెలుసా ? 31 మిలియన్‌ పౌండ్లు.. మన కరెన్సీలో కేవలం‌ రూ.26 కోట్ల రూపాయలు మాత్రమే.

Update: 2024-04-30 02:30 GMT

ఇప్పుడు మనం ఎక్కడ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా తక్కువలో తక్కువ ఒక ఎకరా రూ.20 లక్షలు. మరి 453 ఎకరాలు. చిన్న దీవి. ఒక హెలిప్యాడ్. ఏడు ఇండ్లు. చిన్న పబ్. పక్కన బీచ్. పక్కనే మరో రెండు చిన్న దీవులు. ఒక చిన్న గొర్రెల ఫామ్‌ కూడా ఉంది. అందులో 55 గొర్రెలు కూడా ఉన్నాయి.

అంతా కలిపి ధర ఎంతో తెలుసా ? 31 మిలియన్‌ పౌండ్లు.. మన కరెన్సీలో కేవలం‌ రూ.26 కోట్ల రూపాయలు మాత్రమే. ఉత్తర ఐర్లాండ్‌ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చని, ఉత్తర ఐర్లాండ్‌ లోని క్యాంపెల్‌ టౌన్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ చెబుతున్నది.

పక్కనే ఉన్న చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్‌ హౌజ్‌ కూడా ఉందట. సముద్ర పక్షులు, ఇతర జంతువులు కూడా ఈ దీవిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండటం విశేషం.

కేవలం రూ.26 కోట్ల ఈ ద్వీపం నిత్యానందస్వామి దృష్టికి వెళ్లకముందే స్పందించండి. లేకుంటే మరో కైలాసద్వీపం సృష్టించేయగలడు.

Tags:    

Similar News